janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
గ్రామస్తుల భద్రతకు ప్రాధాన్యం – సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు
అమరావతి, జనవరి 5: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu Naidu స్పందించారు. ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ ద్వారా సమీక్షించారు. ఈ విషయమై మంత్రులు Atchannaidu, Vasanamshetti Subhash ముఖ్యమంత్రితో మాట్లాడి, ఇప్పటికే స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపామని, సహాయ చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావాలని, ప్రమాద ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. జిల్లా అధికారులు, ONGC ప్రతినిధులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.