janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.
కొండగట్టు : తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శుభారంభం చేశారు. భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా టీటీడీ నిధుల ద్వారా రూ.35.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులతో కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు వసతి, సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అధికారులు తెలిపారు.